యాప్నగరం

Chandrababu Naiduని లోపలికి పంపే ప్రయత్నం జరుగుతోంది.. జేసీ సంచలన వ్యాఖ్యలు

TDP| చంద్రబాబును లోపల వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ విషయం ఆయనకు కూడా చెప్పాను. టీడీపీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి.

Samayam Telugu 28 Oct 2019, 8:47 pm
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. చంద్రబాబును జైలుకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాంబ్ పేల్చారు. ఓ న్యూస్ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జేసీ.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. జగన్ పాలనతో పాటూ తెలంగాణ ఆర్టీస సమ్మెపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
Samayam Telugu diwakar.


Read Also: 'ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇదా'

చంద్రబాబును తీవ్రంగా హింసించాలి.. ఆయన్ను లోపలకు తోసెయ్యాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు దివాకర్‌రెడ్డి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. బీజేపీ నుంచి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయో లేదో చెప్పలేనని.. వాళ్ల నుంచి కూడా ఉండొచ్చని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని.. ఆ ఆరోపణలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు కచ్చితంగా జరుగుతున్నాయి.. నగ్న సత్యం. చంద్రబాబును అడిగా.. ఎప్పుడు లోపలికి పోయేది.. ఏంది.. ఏమైనా తెలుసా.. పోయే అవకాశం ఉందా లేదా అని అడిగా. ఆయన కూడా నేను పోను దివాకర్‌రెడ్డి.. నన్ను ఏం చేయలేరు అని చెప్పారు. ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చంద్రబాబుకు చెప్పా.. ఆయనా నేనేమీ తప్పు చేయలేదు అని చెప్పారు’అంటూ జేసీ చెప్పుకొచ్చారుు.

ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని.. అవుతుందో కాదో తనకు తెలియదు అన్నారు జేసీ. వైసీపీ వాళ్లు అనుకునేది అదేనని.. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్ అమాయకుడు.. చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి ఆయన్ను లోపలేశారనే ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. జగన్‌కు కోపం ఉండొచ్చు.. తప్పులేదు.. అందులోనూ రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి జగన్‌కు ఆ ఆలోచనలో ఉన్నా తప్పులేదు అన్నారు.

తనకు జగన్‌ కనిపిస్తే తప్పకుండా మాట్లాడతాను అన్నారు దివాకర్. జగన్ కుటుంబంతో సత్సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయని.. కనిపిస్తే, ఎదురైతే మాట్లాడతాను అన్నారు. వాళ్లతో వ్యక్తిగతంగా వైరం లేదు.. రాజకీయాల్లో మాత్రమే ఉందన్నారు. జగన్ కాస్త దూకుడుగా ఉన్నారని.. పడుతున్నారని.. లేస్తున్నారని చెప్పారు. 100కి 150 మార్కులు వేసేశా.. ప్రజలే ఆలోచించుకుంటారు అంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.