యాప్నగరం

YS Jaganకు అదే పెద్ద సవాల్.. అధిగమిస్తే తిరుగుండదు: మాజీ ఎంపీ ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. జగన్‌కు అసలు సవాల్ ముందు ఉందంటున్న ఉండవల్లి.. అది అధిగమిస్తే తిరుగు ఉండదట.

Samayam Telugu 18 Oct 2019, 3:49 pm
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీది ఎవరూ ఊహించని ఘన విజయం అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. జగన్ పాలనపై తాను గతంలో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన ఆయన.. సీఎంకు తాను సూచనలు మాత్రమే చేశానంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని.. రాజశేఖర్‌రెడ్డి కొడుకుగా అన్నది దాటిపోయి.. జగన్‌గా ప్రజల్లో ఓ ప్రింట్ వేయగలిగారని అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉండవల్లి జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ys jagan.


Read Also: సీఎం జగన్‌కు వైసీపీ ఎమ్మెల్యే లేఖ.. రాజధానిపై కొత్త స్ట్రాటజీ!

జగన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అదే ఊపును కొనసాగించాలి.. నమ్మకాన్ని నిలబెట్టుకోవవడానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం అన్నారు. అందులో నమ్మకాన్ని నిలబెట్టుకుంటే.. కచ్చితంగా కంటిన్యూ అవుతారు.. మంచి నేతగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. అక్కడ దెబ్బతింటే వాళ్ల ఎమ్మెల్యేలు ఎదురు తిరగడం మొదలు పెడతారని.. ఎమ్మెల్యేలకు అసంతృప్తి ఉన్నా.. పబ్లిక్‌లో బావుంటే బయటకు రారని వ్యాఖ్యానించారు. జగన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి భవిష్యత్ ఉంటుంది అంటున్నారు.

రాజకీయ నేతకు ప్రభుత్వాన్ని నడపటం సులభమే కానీ.. పార్టీని నడపటం చాలా కష్టమైన పని అన్నారు ఉండవల్లి. రాబోయే రోజుల్లో జగన్ జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు జగన్‌కు మళ్లాయని.. మొన్న ఎన్నికల్లో జగన్ బీసీలకు కొన్ని సీట్లు కేటాయించి మంచి వ్యూహాత్మకంగా అడుగులు వేశారన్నారు. ఉదాహరణకు రాజమండ్రి సీటు బీసీకి ఇచ్చి మంచి నిర్ణయం తీసుకున్నారని.. సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు మంచి చేస్తే తిరుగు ఉండదంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.