యాప్నగరం

Chandrababu Naidu అక్కడే ఫెయిల్.. ఇప్పటికైనా మారకపోతే: ఉండవల్లి

Undavalli Arun Kumar| చంద్రబాబు ఐదేళ్లు ఏ లోటు లేకుండా రాష్ట్రాన్ని జాగ్రత్తగా నెట్టుకొచ్చారు. కిందామీదా పడి ఐదేళ్లు జీతాలు ఇచ్చారు. కానీ తాను చేసిన పనుల గురించి చెప్పుకోవడం మానేసి జగన్‌ను లక్ష కోట్ల పేరుతో విమర్శించడమే పెద్ద తప్పు.

Samayam Telugu 18 Oct 2019, 4:31 pm
సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. చంద్రబాబు కాస్త రాంగ్ రూట్‌లో వెళ్లారని.. జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఘన విజయం సాధించగలిగారు అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పదే, పదే జగన్ లక్ష కోట్లు తిన్నారనే ప్రచారం చేశారని.. లక్ష కోట్లు తిన్నారని చెబితే ప్రజలు ఓటు వేయరని అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
Samayam Telugu cbn


Read Also: YS Jaganకు అదే పెద్ద సవాల్.. అధిగమిస్తే తిరుగుండదు: మాజీ ఎంపీ ఉండవల్లి

అధికారంలో ఉన్నవాడిగా ఏం చేశామో చెప్పాలని.. చంద్రబాబు అక్కడ ఫెయిల్ అయ్యారని అభిప్రాయపడ్డారు ఉండవల్లి. చంద్రబాబు బ్యాడ్ పొజిషన్‌లో ఉన్న రాష్ట్రాన్ని.. కిందామీద పడి ఐదేళ్లు నడిపి జీతాలు ఇచ్చారని.. అలాగే అప్పులు పెరిగాయని.. మొత్తానికి జీతాలు, పింఛన్లకు ఇబ్బంది లేకుండా చేశారన్నారు. ఈ విషయాన్ని ప్రపంచంలోనే టాప్ తానే అని చెప్పడంలో ఫెయిల్ అయ్యారని.. ఇటు జగన్‌ను ఎదుర్కోవడంలో కాస్త ట్రాక్ తప్పారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘నేనైతే (చంద్రబాబు) ఇలా నడుపుతున్నాను.. నువ్వు (జగన్) ఎలా నడుపుతావో చెప్పు. ఏం చేసి నడుపుతావు.. నవరత్నాలు ప్రకటించావు.. డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పు.. ఇవాళే నేను తప్పుకుంటా నువ్వొచ్చి కూర్చొందువు కానీ’చెప్పాల్సింది పోయి లక్ష కోట్లు తిన్నారనే విషయాన్ని పదే, పదే ప్రస్తావించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో అలా జరగలేదని.. ఈయన (చంద్రబాబు) లక్ష కోట్లు అంటే.. ఆయన (జగన్) ఐదు లక్షల కోట్లు అంటూ దెబ్బలాడుకున్నారని.. తర్వాత జగన్ స్ట్రాటజిక్‌గా జనంలోకి వెళ్లారని.. దేశంలోనే పాదయాత్ర ఎక్కడా జరగలేదన్నారు. అందుకే ఘన విజయం సాధించారని అభిప్రాయపడ్డారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఇంత వ్యతిరేకతలో పొత్తు లేకుండా సొంతంగా ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుకు 39శాతం ఓట్లు వచ్చాయని.. ఇది చాలా గొప్పతనమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ చంద్రబాబు తాను ఈ తప్పు చేస్తున్నానని చెప్పలేకపోతున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రూ.700 కోట్లు మిగిలాయంటే.. ఇదంతా తప్పు అనడం సరికాదని.. అందులో ఏం తప్పు జరిగిందో చెప్పలగలగాలి అన్నారు. ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి చంద్రబాబు తన పంధా మార్చుకోవాలన్నారు. తాను చేసిన తప్పుల్ని సరి చేసుకుంటే బావుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.