యాప్నగరం

YS Jagan సర్కార్ ఘోరంగా విఫలం.. అదో సిగ్గుమాలిన పని.. ఉండవల్లి తీవ్ర వ్యాఖ్యలు

దివంగత వైఎస్సార్ చిరకాల మిత్రులు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 24 Jun 2020, 6:36 pm
కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చర్యలపై ఉండవల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టుల్లో తీర్పులిచ్చే న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ధర పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారనుకోవడం ఒట్టి భ్రమ మాత్రమేనన్నారు.
Samayam Telugu ఉండవల్లి అరుణ్ కుమార్


మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారని ఉండవల్లి ప్రశ్నించారు.. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ నిమ్మగడ్డ రమేష్‌పై మాట్లాడం ఘోరమైన చర్య అని అభిప్రాయపడ్డారు. పాలకులకు కనిపించాల్సింది ప్రజలు కానీ ప్రత్యర్థులు కాదని.. అధికారంలోకి వచ్చింది పగ తీర్చుకోవడానికి కాదని హితవు పలికారు. అయినా ఏం చేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదు.. అక్కడుంది నిమ్మగడ్డ రమేష్, ఏబీ వెంకటేశ్వరరావు అని ఉండవల్లి పేర్కొన్నారు.

ప్రజలకు రూ.80,500 కోట్లు పంచుతామని ప్రభుత్వం అంటోందని.. అయితే ఎక్కణ్నుంచి అంత డబ్బు తెచ్చి ఇస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. అలాగే కరోనా నేపథ్యంలో కొంత మంది నిబంధనలు పాటించడంలేదని విమర్శించారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం కూడా పాటించడంలేదన్నారు. ప్రజల్లో ఎక్కువగా తిరిగే వలంటీర్లు, ఆశావర్కర్లు, మీడియా ప్రతినిధులు అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఉండవల్లి సూచించారు. మాస్కు వేసుకోకపోతే ఫైన్ వేస్తున్న అధికారులు వాళ్లు ఎందుకు మాస్కులు ధరించడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.