హిందుస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. క్రేన్ డిజైన్, స్ట్రక్చర్ నిర్మాణాల్లో లోపాల వల్ల ఆటోమేషన్ సరిగ్గా పనిచేయకపోవడంతో దుర్ఘటన చోటు చేసుకుందని నిపుణుల కమిటీ తేల్చింది. బేస్మెంట్కు అమర్చిన బోల్టులు విరిగిపోవడంతో పక్కకు ఒరిగిపోయి కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే భారీ శబ్దంతో క్రేన్ కుప్పకూలిపోయిందని వెల్లడించారు.
ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్లు శశిభూషణరావు, కె.శ్రీనివాసరావు, ఎన్.రమణయ్య, పి.మల్లికార్జునరావు, రిటైర్డ్ అధికారి డాక్టర్ బి.పార్వతీశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేశవరావు, విశాఖ ఆర్డీవో పెంచలకిషోర్లతో ఈ ఘటనపై కలెక్టర్ వినయ్చంద్ కమిటీ వేశారు. అన్ని కోణాల్లో 10 రోజుల పాటు వివరాలను సేకరించిన ఈ కమిటీ.. నివేదికను రూపొందించి అందజేసిందని కలెక్టర్ వెల్లడించారు.
నివేదికను మీడియాకు వెల్లడించిన కలెక్టర్.. ప్రమాదానికి గల బాధ్యులను గుర్తించి తదుపరి చర్యలను పోలీసులు తీసుకుంటారని అన్నారు. మరోవైపు, పరిశ్రమ అవసరాల దృష్ట్యా భారీ క్రేన్ కొనుగోలు చేయాలని 2009 మే 30న షిప్యార్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన 2012 నవంబరు 1లో గ్లోబల్ టెండర్లను పలిచింది. గుజరాత్కు చెందిన అనుపమ సంస్థ కాంట్రాక్ట్ను దక్కించుకుని, రూ.17.75 కోట్లతో క్రేన్ను కొనుగోలు చేసింది.
అయితే, 2018లో జరిగిన లోడ్ టెస్టింగ్ సమయంలో కార్బన్ బ్రెష్లు ఊడిపోవడం, ఇన్సులేటర్లు దెబ్బతినడాన్ని గుర్తించారు. ఆయా లోపాలను ఇప్పటికీ సరిచేయలేదని నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ ఏడాది జులై 20న 36 టన్నులతో లోడ్ టెస్టింగ్ నిర్వహించగా.. లూబ్రికెంట్ ఆయిల్ లీకై గేర్బాక్సుల్లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు లోపాలు తలెత్తినా వాటిని సరిదిద్దకుండా ఆగస్టు 1న 70 టన్నుల లోడ్ టెస్టింగ్కు వెళ్లినట్లు నిపుణుల కమిటీ తేల్చింది.
స్ట్రక్చర్, డిజైన్, క్రేన్ డ్రాయింగ్స్ను మూడో పార్టీతో పునఃపరిశీలన చేయలేదు.. 70 టన్నుల సామర్థ్యం గల క్రేన్ స్ట్రక్చర్ 110 టన్నుల బరువును మోసేలా ఉండాలి.. కానీ అలాంటి ఏర్పాట్లు లేకపోవడం, సాంకేతిక లోపాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చినట్టు కలెక్టర్ వివరించారు.
ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్లు శశిభూషణరావు, కె.శ్రీనివాసరావు, ఎన్.రమణయ్య, పి.మల్లికార్జునరావు, రిటైర్డ్ అధికారి డాక్టర్ బి.పార్వతీశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేశవరావు, విశాఖ ఆర్డీవో పెంచలకిషోర్లతో ఈ ఘటనపై కలెక్టర్ వినయ్చంద్ కమిటీ వేశారు. అన్ని కోణాల్లో 10 రోజుల పాటు వివరాలను సేకరించిన ఈ కమిటీ.. నివేదికను రూపొందించి అందజేసిందని కలెక్టర్ వెల్లడించారు.
నివేదికను మీడియాకు వెల్లడించిన కలెక్టర్.. ప్రమాదానికి గల బాధ్యులను గుర్తించి తదుపరి చర్యలను పోలీసులు తీసుకుంటారని అన్నారు. మరోవైపు, పరిశ్రమ అవసరాల దృష్ట్యా భారీ క్రేన్ కొనుగోలు చేయాలని 2009 మే 30న షిప్యార్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన 2012 నవంబరు 1లో గ్లోబల్ టెండర్లను పలిచింది. గుజరాత్కు చెందిన అనుపమ సంస్థ కాంట్రాక్ట్ను దక్కించుకుని, రూ.17.75 కోట్లతో క్రేన్ను కొనుగోలు చేసింది.
అయితే, 2018లో జరిగిన లోడ్ టెస్టింగ్ సమయంలో కార్బన్ బ్రెష్లు ఊడిపోవడం, ఇన్సులేటర్లు దెబ్బతినడాన్ని గుర్తించారు. ఆయా లోపాలను ఇప్పటికీ సరిచేయలేదని నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ ఏడాది జులై 20న 36 టన్నులతో లోడ్ టెస్టింగ్ నిర్వహించగా.. లూబ్రికెంట్ ఆయిల్ లీకై గేర్బాక్సుల్లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు లోపాలు తలెత్తినా వాటిని సరిదిద్దకుండా ఆగస్టు 1న 70 టన్నుల లోడ్ టెస్టింగ్కు వెళ్లినట్లు నిపుణుల కమిటీ తేల్చింది.
స్ట్రక్చర్, డిజైన్, క్రేన్ డ్రాయింగ్స్ను మూడో పార్టీతో పునఃపరిశీలన చేయలేదు.. 70 టన్నుల సామర్థ్యం గల క్రేన్ స్ట్రక్చర్ 110 టన్నుల బరువును మోసేలా ఉండాలి.. కానీ అలాంటి ఏర్పాట్లు లేకపోవడం, సాంకేతిక లోపాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చినట్టు కలెక్టర్ వివరించారు.