యాప్నగరం

బ్యారేజీలో బోటు ఎట్టకేలకు బయటకు.. ఊపిరి పీల్చుకున్న వైఎస్‌ఆర్సీపీ!

కృష్ణానదికి వరదల సమయంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 68 గేటు వద్ద ఓ బోటు అడ్డుపడింది. దీంతో వరద తగ్గుముఖం పట్టినా ఆ గేటును మూసివేయడం కుదరక నీరు దిగువకు పోయింది.

Samayam Telugu 25 Aug 2019, 1:24 pm
ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న పడవను బయటకు తీసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. గత ఐదు రోజులుగా శ్రమించిన నిపుణుల బృందం ఆదివారం మధ్యాహ్నం పడవను గేటు నుంచి తొలగించింది. బోటుకు రంధ్రాలు చేసి రోప్ సాయంతో బయటకు తీశారు. బోటు ఆపరేషన్ కోసం కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నుంచి వచ్చిన నిపుణుల బృందాలను రప్పించారు. కృష్ణానది వరద సమయంలో ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద బోటు చిక్కుకోగా, వరద తగ్గిన తర్వాత అన్ని గేట్లను మూసివేసినా ఇది అడ్డంగా ఉండటంతో సదరు గేటు మూసివేత సాధ్యంకాలేదు. తత్ఫలితంగా పెద్ద మొత్తంలో నీరు వృథాగా దిగువకు పోయింది. గత కొన్ని రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో గేటు మూసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, ఈ విషయంలో అధికార పార్టీపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
Samayam Telugu boat


జలవనరుల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్వయంగా బోటు తొలగించే పనులని శనివారం పర్యవేక్షించారు.
బోటును తొలగించేందుకు అరవై మంది సిబ్బంది అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. ఈ పనుల కోసం బ్యారేజ్ మీదకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శనివారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఆపరేషన్ జరగుతుండగా ప్రమాదవశాత్తూ వరద నీటిలో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బోటును తీసే ప్రక్రియను చూస్తుండగా.. అతడు కాలుజారి వరద నీటిలో కొట్టుకుపోయాడు. కాసేపు ఈత కొట్టేందుకు ప్రయత్నించినా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. మత్స్యకారులు అతడ్ని ఒడ్డుకు చేర్చి కాపాడే ప్రయత్నం చేసినా ప్రాణాలు దక్కలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.