యాప్నగరం

Fact check: ఏపీ ఎన్నికల వీడియోను ఇలా కూడా వాడుకుంటున్నారా?

రాజస్థాన్‌లో ఓ స్వతంత్ర అభ్యర్థి పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. బర్మేర్ జిల్లా శివ్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్న రవీంద్ర సింగ్ భాటి పేరు బలంగా వినపడుతోంది. ఇదే సమయంలో రవీంద్ర సింగ్ భాటికి చెందినదిగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన సభకు జనం వేలాదిమంది తరలివచ్చినట్లు అందులో ఉంది. అయితే ఈ వీడియో అబద్ధమని తేలింది. అది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందినదిగా ఫ్యాక్ట్ చెకింగ్‌లో నిర్ధారణ అయ్యింది.

Contributed by Fact Crescendo |Edited byవంకం వెంకటరమణ | Samayam Telugu 19 Apr 2024, 7:26 pm

వైరల్ అవుతున్న వీడియో కథేంటి?

ప్రస్తుతం దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోనూ ఎన్నికల కోలాహలం నెలకొంది. అయితే రాజస్థాన్‍‌లోని బార్మర్ జిల్లాలో మాత్రం ఓ అభ్యర్థి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అయితే ఆయనేమీ రాజకీయపార్టీలకు చెందిన నేత కాదు. ఓ స్వతంత్ర అభ్యర్థి. ఆయనే శివ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న రవీంద్ర సింగ్ భాటి. ప్రస్తుతం ఈయనకు సంబంధించినదిగా చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. వేలాదిమంది జనం ఉన్నారు. రోడ్లు మొత్తం జనంతో నిండిపోయాయి. ఈ వీడియోను రవీంద్ర సింగ్ భాటి మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేస్తున్నారు.
Samayam Telugu Rajasthan Elections
ఏపీ ఎన్నికల వీడియోను ఇలా కూడా వాడుకుంటున్నారా?


అసలు నిజమేంటీ?

అయితే వైరల్ అవుతున్న వీడియో అబద్ధమని తేలింది. వీడియోలో ఉంది నిజమే అయినా అది రవీంద్ర సింగ్ భాటికి చెందినది కాదు. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందినది అసలే కాదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.

ఎలా తెలిసిందంటే?

వైరల్ అవుతున్న వీడియో నిజ నిర్ధారణ కోసం మేము గూగుల్ రివర్స్ సెర్చ్ ఇమేజ్ టూల్ ఉపయోగించాం. దీని ద్వారా వైరల్ అవుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినదిగా తేలింది. వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను 2024 మార్చి 10వ తేదీన పోస్ట్ చేశారు. అలాగే హ్యాష్ ట్యాగ్‌లోనూ ఆంధ్రప్రదేశ్ రాసుకొచ్చారు.

అలాగే ఇదే వీడియోనూ మరో ఎక్స్ యూజర్ కూడా షేర్ చేశారు. 2024 మార్చి పదో తేదీన ఇదే వీడియోను ఓ యూట్యూబ్ ఛానెల్ సైతం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సైతం అదేరోజు ఈ వీడియోను అప్ లోడ్ చేశారు. ఇక ఎన్డీటీవీ యూట్యూబ్ ఛానెల్ లోనూ మార్చి 10న ఈ వీడియోను అప్ లోడ్ చేశారు. బాపట్లలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ర్యాలీకీ లక్షల మంది జనం వచ్చారని అందులో రాసుకొచ్చారు.

అలాగే ఏఎన్ఐ అధికారిక ఎక్స్ ఖాతాలోనూ ఈ వీడియో ఉంది.

తీర్పు

మొత్తంగా ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది ఏమిటంటే.. రాజస్థాన్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో అబద్ధం. వీడియోలో ఉన్న జనం నిజమే కానీ.. అది రవీంద్ర సింగ్ భాటి ర్యాలీకాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాపట్లలో నిర్వహించిన మేమంతా సిద్ధం ర్యాలీ వీడియోను.. రవీంద్ర సింగ్ భాటికి చెందిన ర్యాలీగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కనుక వైరల్ అవుతున్న వీడియో అబద్ధంగా మేము నిర్ధారిస్తున్నాం.

(This story was originally fact checked by Fact Crescendo and translated by Samayam Telugu, as part of the Shakti Collective)
రచయిత గురించి
వంకం వెంకటరమణ
వంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.