యాప్నగరం

సుధా నారాయణమూర్తి రాజీనామా ప్రచారం.. టీటీడీ సీరియస్

టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ తీవ్రంగా స్పందించింది.

Samayam Telugu 6 Jun 2020, 7:09 pm
తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడు నారాయణమూర్తి భార్య సుధా నారాయణమూర్తిపై ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయ చరిత్ర, టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేల వ్యవహరించిన వారిపై చర్యలకు వెనకాడేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
Samayam Telugu నారాయణమూర్తి, సుధానారాయణమూర్తి


ఇక జూన్ 30వ తేదీ వరకు శ్రీవారి దర్శనాలు రద్దంటూ సోషల్‌ మీడియా, పత్రికలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురిపై, రెండు పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ తెలిపింది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం ద్వారా వీరిపై కేసు నమోదైంది.

కాగా, శ్రీవారి ఆలయం, భక్తుల‌పై వివాదస్పద పదజాలం వాడిన తమిళ నటుడు శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు తిరుమల డీఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు. టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.. తెలుగు ఎథిస్ట్ ఫేస్ బుక్ పేజీపైనా కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.