యాప్నగరం

గుంటూరు: దొంగతనం ఆరోపణలు.. మనస్తాపంతో ముగ్గురి ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మోటార్లు దొంగతనం చేశారనే ఆరోపణలు రావడంతో.. ఆ మనస్తాపంతో భార్యాభర్తలు కూతురితో కలిసి ప్రాణాలు తీసుకున్నారు.

Samayam Telugu 25 May 2020, 3:02 pm
గుంటూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. బాపట్ల మండలం మరుప్రోలువారి పాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మోటార్లు దొంగతనం చేశారనే ఆరోపణలు రావడంతో.. ఆ మనస్తాపంతో భార్యాభర్తలు కూతురితో కలిసి ప్రాణాలు తీసుకున్నారు. ఈ నెల 10న బాసివిరెడ్డిపాలెంలో మోటార్లు చోరీ అయ్యాయి. ఈ నెల 16న పోలీస్ స్టేషన్‌లో మోటార్‌ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో మరుప్రోలువారిపాలెంకు చెందిన వీరస్వామిరెడ్డి దొంగతం చేసినట్లుగా తేలిందట. ఈ నెల 21న అతడ్ని పిలిపించి ప్రశ్నించారట.. 22న 4 మోటార్లు రికవర్ చేశారట.
Samayam Telugu బాపట్ల ఆత్మహత్య


ఈ నెల 23న వీరాస్వామిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. సోమవారం ఉదయం వీరాస్వామిరెడ్డి కుటుంబం ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తీసి చూడగా భార్యాభర్తలు, కూతురు కిందపడిపోయి కనిపించారు. కొన ఊపిరితో ఉన్న వీరాస్వామిరెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతడి భార్య, కుమార్తె చనిపోయారు.

చోరీ చేశారనే ఆరోపణలు రావడంతోనే ముగ్గురు ఆహారంలో విషం కలుపుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే వీరాస్వామిరెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులతో చెప్పి కొట్టిస్తామని బెదిరించటంతో ఆత్మహత్య చేసుకున్నారని వీరారెడ్డి బావమరిది అంకిరెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం మోటార్లు చోరీ చేసి దొరికిపోయారనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నారని చెబుతున్నారు.
Please Vote: పోల్: జగన్ ఏడాది పాలన ఎలా ఉంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.