యాప్నగరం

అమరావతిలో కిడ్నాప్ కలకలం.. గన్‌తో బెదిరించి రూ.12 కోట్ల ఆస్తి..

నిత్యం దైవకార్యక్రమాలతో గడిపే రమేష్‌ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భూమిని కాజేసేందుకు ల్యాండ్ మాఫియా ప్లాన్ చేసింది. కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించి బలవంతంగా సంతకాలు సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 29 Nov 2019, 11:20 pm
ఏపీ రాజధాని అమరావతిలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అరాచకానికి పాల్పడింది. వ్యక్తిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్‌ ఇస్తూ చిత్రహింసలకు గురిచేసింది. గన్‌తో కాల్చివేస్తామని బెదిరించి రాజధాని పరిధిలో అత్యంత విలువైన భూమిని చేజిక్కించుకుంది. అకృత్యాలకు పాల్పడి యజమానితో బలవంతంగా స్టాంప్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్న అమానుష సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించింది.
Samayam Telugu electric-shock-1


అమరావతి మండలం ధరణికోటలో జరిగిన దారుణ ఘటన మాఫియా సినిమాను తలపించింది. కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు ల్యాండ్ మాఫియా అరాచకాలకు దిగింది. గ్రామానికి చెందిన వడ్లమూడి రమేష్ వ్యక్తికి చెందిన ఆరెకరాల భూమిని బలవంతంగా లాక్కునేందుకు అతనిని మాఫియా ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. మూడు రోజులుగా వారికి కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది.

Also Read: సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం.. విజయవాడలో దారుణం

రమేష్ ఇంటి పక్కనే నివసిస్తున్న చేకూరి వెంకటేశ్వరరావు చౌదరి కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేశాడు. నిత్యం దైవకార్యక్రమాలతో గడిపే రమేష్‌ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భూమిని కాజేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు ఆరున్నర ఎకరాల భూమిని బచ్చుల నాగయ్య, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సమాచారం. తన భూమి తనకు ఇవ్వాలని అడిగినందుకు రమేష్‌ని చిత్రహింసలు పెట్టారు. పిల్లలను కూడా చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం.

ల్యాండ్ మాఫియా అరాచకాలతో భయపడిపోయిన రమేష్ స్థానికులు ధైర్యం చెప్పడంతో అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఒక్కసారిగా భూములు ఆకాశాన్నంటడంతో భూ కుంభకోణాలు పెరిగిపోయాయి. చిన్నాచితకా వ్యక్తులను బెదిరించి భూములను లాగేసుకున్న ఘటనలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజా ఘటన భూ కుంభకోణాలకు పరాకాష్టగా నిలుస్తోంది.

Read Also: శబరియాత్రలో విషాదం.. బాధితులంతా విజయనగరం వాసులే.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.