యాప్నగరం

ఏపీ: కరోనాతో ప్రముఖ బిర్యానీ హోటల్ నిర్వాహకుడు మృతి

గుంటూరులో ప్రముఖ బిర్యానీ హోటల్‌ నిర్వాహకుడు అనారోగ్యంతో చనిపోయాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై మృతుడి కుటుంబసభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు ఆరా తీస్తున్నారు.

Samayam Telugu 27 Apr 2020, 7:31 am
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఇరుగు-పొరుగున ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిలా ఉంటే.. గుంటూరులో ప్రముఖ బిర్యానీ హోటల్‌ నిర్వాహకుడు అనారోగ్యంతో చనిపోయాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై మృతుడి కుటుంబసభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మృతుడి కుటుంబసభ్యులు, బంధువులను క్వారంటైన్ కి తరలించారు.. పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.
Samayam Telugu guntur


అతడికి మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు బయటపడ్డాయట. అతడ్ని ఫీవర్ ఆస్పత్రికి తరలించి పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారట. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈలోపే ఆయన చనిపోగా.. రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ తేలింది. బిర్యానీ హోటల్ నిర్వాహకుడి మరణం గుంటూరులో కలకలంరేపింది. అతడికి కరోనా ఎలా సోకిందో అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.