యాప్నగరం

గ్రామ కార్యదర్శిపై పెట్రోల్ పోసిన రైతు.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం

పంచాయతీ కార్యదర్శిపై పెట్రోల్ పోసిన రైతు.. రైతు భరోసా గ్రామసభలో కలకలం. అప్రమత్తమై రైతును అడ్డుకున్న స్థానికులు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఘటన.

Samayam Telugu 6 Nov 2019, 7:29 pm
తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మేట్ విజయారెడ్డి హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం రేపింది.. దీంతో రెవెన్యూ ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యింది. ఏపీలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ కార్యదర్శిపై పెట్రోల్ పోసి, తనపై పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు. ఈలోపు చుట్టుపక్కల ఉన్నవాళ్లు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
Samayam Telugu sklm


శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకులపాడులో.. తన పొలంలో తవ్విన డ్రైన్లు పూడ్చకపోవడంతో అసహనానికి గురైన రైతు జగన్ మోహన్ రావు.. రైతుభరోసా లబ్ధిదారుల కోసం నిర్వహించిన గ్రామసభలో పెట్రోల్‌తో హల్‌చల్ చేశాడు. దీనికి పంచాయతీ కార్యదర్శే కారణమని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శిని చంపుతానంటూ పెట్రోల్ చల్లాడు. అది గ్రామసభలో ఉన్న అధికారులపై పడగా.. వెంటనే స్థానికులు అప్రమత్తమైన జగన్‌మోహన్‌రావును అడ్డుకున్నారు.
జగన్‌ మోహన్‌రావును పట్టుకున్న స్థానికులు పక్కకు తీసుకొచ్చారు.. అతడి ప్రయత్నాలను ఆపేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రైతు పెట్రోల్ చల్లడంతో గ్రామసభలో అలజడి రేగింది. జనాలు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.