యాప్నగరం

గుంటూరు జిల్లాలో దారుణం.. పోలీసుల ముందే కత్తులతో పొడుచుకున్న రైతు

ఉదయం నుంచి తాను కౌలు చేస్తున్న పొలంలో కుర్చీ వేసుకుని కూర్చుని సలీం దీక్ష చేస్తున్నాడు. పంటను కోసేందుకు ప్రయత్నించడంతో పొలంలోనే రెండు కత్తులతో పొట్టలో పొడుచుకున్నాడు.

Samayam Telugu 22 Dec 2020, 1:41 pm
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. వేమూరు మండలం పోతుమర్రులో పొలం వివాదంతో ఓ వ్యక్తి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ పొలం విషయంలో గత కొంత కాలంగా వివాదం నడుస్తుండగా.. ఉదయం నుంచి తాను కౌలు చేస్తున్న పొలంలో కుర్చీ వేసుకుని కూర్చుని సలీం దీక్ష చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో పంటను స్వాధీనం చేసుకునేందుకు వచ్చినప్పుడు రైతు సలీం వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే పంటను కోసేందుకు ప్రయత్నించడంతో పొలంలోనే రెండు కత్తులతో పొట్టలో పొడుచుకున్నాడు.
Samayam Telugu గుంటూరు జిల్లాలో దారుణం


తాను పద్మావతి అనే మహిళ కౌలుకు తీసుకున్నట్లు చెప్పాడు.. అందులో వరి పంట వేశానని.. ఆ ఆరు ఎకరాల పొలాన్ని అధికారపార్టీకి చెందిన నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. చేసేదిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పాడు. తన పొలం లాక్కునేందుకు విజయసాయి రెడ్డి అనుచరులు ప్రయత్నిస్తున్నారని.. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అనుచరులపైనా ఆరోపణలు చేశాడు. తాను కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తనని.. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డానని సలీలం వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే అతడ్ని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సలీం ఆత్మహత్యాయత్నం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.