యాప్నగరం

కృష్ణా: కన్నకూతురిని రూ. లక్షన్నరకు అమ్మేసిన తండ్రి.. ఎస్సై దగ్గరికి తల్లి వెళ్తే..!

కృష్ణా జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నకూతురిని తండ్రి అమ్మేశాడు.

Samayam Telugu 30 Aug 2020, 10:32 pm
కృష్ణా జిల్లా ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ సంఘటన చోటుచేసుకొంది. ఓ వ్యక్తి తన భార్య కళ్లుగప్పి కన్న కూతురిని అమ్మేశాడు. వలసపల్లి గ్రామానికి చెందిన నవీన్‌బాబు, రజిని దంపతులకు నలుగురు ఆడపిల్లలు సంతానం. అయితే ఎన్ని సార్లయినా ఆడపిల్లలే పుడుతున్నారంటూ తల్లిదండ్రులతో కలిసి నవీన్‌బాబు భార్య రజినీని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే మరోసారి తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
Samayam Telugu చిన్నారులతో తల్లి


దీన్ని అదనుగా భావించిన నవీన్‌బాబు నాలుగో కూతురిని రూ. 1.50 లక్షలకు అమ్మేశాడు. అయితే, డబ్బుల పంపిణీలో నవీన్‌బాబుకు అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ తరుణంలో గాయాల నుంచి కోలుకున్న రజినీ తన బిడ్డ ఎక్కడనీ భర్త, అత్తమామలను నిలదీసింది. దీంతో వారంతా కలిసి మరోసారి రజనీపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న రజినీ తన తల్లిదండ్రులతో కలిసి బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, న్యాయం చేస్తాడనుకున్న ముసునూరు ఎస్‌ఐ బిడ్డను కొన్న దంపతులను స్టేషన్‌కి పిలిపించి తల్లి రజినీతో ఫొటోలు తీయించి తిరిగి వారికే అప్పగించాడని బాధితురాలు వాపోయింది. ఎస్ఐ తనపట్ల దారుణంగా వ్యవహరించాడని రజనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తన బిడ్డను ఇప్పించాలని బాధితురాలు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును ఆశ్రయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.