యాప్నగరం

తిరుమలలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

శ్రీవారి ఆలయ సమీపంలోని లడ్డూ బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం జరిగింది. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే శ్రీవారి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేసింది.

Samayam Telugu 8 Dec 2019, 7:42 pm
తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయ సమీపంలోని బూందీ తయారీ పోటులో మంటలు చెలరేగాయి. ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూకి ఉపయోగించే నెయ్యి కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. బూందీ పోటులో నెయ్యి పడడంతో గ్యాస్ స్టౌకి మంటలు అంటుకున్నట్లు సమాచారం.
Samayam Telugu tirumala


గ్యాస్ స్టౌకి మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. శ్రీవారి ఆలయ సమీపంలో భారీ ఎత్తున మంటలు కనిపించాయి. దట్టంగా పొగ అలముకుంది. లడ్డూ తయారీ పోటు సిబ్బంది తక్షణ స్పందించి గ్యాస్ స్టౌను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో అగ్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Also Read: భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. కర్నూల్‌లో రేటెంతో తెలుసా..!

ఫైర్ సిబ్బంది తక్షణం స్పందించి శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటు వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే శ్రీవారి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేసింది. అయితే భక్తులకు ఎలాంటి ప్రమాదం కలగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ బూందీ పోటులో అగ్నిప్రమాదం జరగింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Read Also: కన్నెర్రజేసిన సీఎం జగన్.. ఆధిపత్యం ఇక్కడ చెల్లదు.. ఆ ఎమ్మెల్యేకి షోకాజ్.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.