యాప్నగరం

శ్రీశైలం అడవుల్లో భారీగా మంటలు.. ఆందోళనలో శివ భక్తులు

శ్రీశైలం అటవీ ప్రాంతంలో మరోసారి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అటవీ ప్రాంతం గుండా పాదయాత్రగా వెళ్తున్న శివ భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Samayam Telugu 17 Feb 2020, 5:57 pm
కర్నూలు జిల్లా శ్రీశైలం బిముణికొలను అడవి ప్రాంతంలో మరోసారి భారీగా మంటలు చెలరేగుతున్నాయి. దీంతో పాదయాత్రగా శ్రీశైలం వెళ్తున్న శివస్వాములు, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బిముణికొలను అడవి మీదుగా శివ భక్తులు పాదయాత్రగా వెళ్తుండగా.. ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో మండలు చెలరేగాయి. దీంతో పాదయాత్రగా వస్తున్న భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Samayam Telugu srisailam


మరోవైపు శివరాత్రి వస్తున్న నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకు శివస్వాములు పాదయాత్ర చేస్తూ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నారు. ఈ సమయంలో భారీగా మంటలు చెలరేగుతుండటంతో శ్రీశైల పుణ్యక్షేత్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు. అయితే హఠాత్తుగా మంటలు చెలరేగడానికి కారణమేంటో వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవలే నల్లమల అటవీ ప్రాంతంలో సైతం భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. నల్లమల అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం రాజుకున్న కార్చిచ్చులో పెద్ద ఎత్తున అడవి దగ్ధమైంది. ఈ నెలలోనే రోజుల వ్యవధిలో పలుసార్లు అగ్నిప్రమాదం సంభవించడంతో అటవీ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.