యాప్నగరం

చిత్తూరు: కారు కొని గుడికి వెళ్తుండగా ప్రమాదం.. మంటల్లో కాలి బూడిద

కారు రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నవాళ్లంతా బయటకు దిగేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

Samayam Telugu 6 Aug 2020, 9:26 am
చిత్తూరు జిల్లాలో కారులో మంటలు చెలరేగాయి. పూతలపట్టు మండలంలోని వజ్జి రెడ్డిపల్లి దగ్గర ఆరో జాతీయ రహదారిపై ఉన్నట్టుండి ఈ ప్రమాదం జరిగింది. కే.ఎన్‌.ఆర్‌ కన్స్‌స్ట్రక్షన్స్‌ లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న రాజేష్ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి కాణిపాకంలో పూజకు వెళుతున్నాడు. కారు రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నవాళ్లంతా బయటకు దిగేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని మంటల్ని ఆర్పేశారు.
Samayam Telugu మంటల్లో కాలిపోయిన కారు


ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది. కష్టపడి కొనుక్కున్న కారును పూజ చేయించేందుకు తీసుకెళుతుండగా.. ఇలా మంటల్లో కాలిపోయిందని రాజేష్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంజన్‌లో మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.