యాప్నగరం

కాకినాడ: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరి మృతి

Kakinada: తూర్పు గోదావరి జిల్లా సర్పవరంలో రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Samayam Telugu 12 Mar 2021, 1:51 am
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరంలో విషాదం చోటు చేసుకుంది. టైకీ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మాధవపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాయిలర్ పేలుడుతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది.
Samayam Telugu సర్పవరం పేలుడు
Kakinada chemical factory blast video



గురువారం (మార్చి 11) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కన్నబాబు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: పిల్లిని చంపేందుకు పాలలో విషం.. సీన్ రివర్స్, బాలుడికి ప్రాణగండం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.