యాప్నగరం

ఏపీలో జీఎస్టీ చట్టం కింద తొలి అరెస్ట్

ఏపీలో జీఎస్టీ చట్టం కింద మొదటి కేసు నమోదైంది. విశాఖపట్నంలో శేఖర్ అనే వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.

Samayam Telugu 18 Feb 2020, 10:59 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం కింద మొట్టమొదటి కేసు నమోదైంది. విశాఖపట్నంలో శేఖర్‌ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్‌ యజమాని శేఖర్‌‌ను జీఎస్టీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌ వే బిల్లులు దుర్వినియోగం చేసి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలోని వ్యాపారస్థులకు అమ్మకాలు సాగించడం.. తిరిగి వారి నుంచే కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి భారీగా పన్నులు ఎగ్గొట్టారని శేఖర్‌పై ఫిర్యాదులు అందాయి.
Samayam Telugu GST-Arrest-Tax-Scan


దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు.. శేఖర్‌ దాదాపు రూ.2.6 కోట్ల పన్ను ఎగవేశారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆన్‌లైన్‌ వే బిల్లుల దుర్వినియోగం ద్వారా ఇంత భారీ మొత్తం పన్ను ఎగవేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మరికొందరు వ్యాపారులు సైతం దాదాపు రూ. 10 కొట్ల వరకు పన్ను ఎగవేసి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శేఖర్‌ను మంగళవారం కోర్టులో హాజరుపరచగా.. విచారించిన న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ చట్టం కింద నమోదైన తొలి కేసుగా ఇది నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.