యాప్నగరం

నరసరావుపేటలో తొలి కరోనా పాజిటివ్.! రెండ్రోజుల కిందట మరణించిన వ్యక్తికి..

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. టీబీ, నెమ్ముతో రెండు రోజుల కిందట మరణించిన నరసరావుపేట వ్యక్తికి పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Samayam Telugu 9 Apr 2020, 2:04 pm
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా నరసరావుపేటలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. నరసరావుపేటలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. పది రోజుల కిందట నరసరావుపేట పట్టణానికి చెందిన వ్యక్తి టీబీ, నెమ్ముతో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చేరాడు.
Samayam Telugu corona virus


ఆయన చికిత్స పొందుతూ రెండు రోజుల కిందట ఆస్పత్రిలోనే మృతిచెందాడు. అనుమానం వచ్చిన వైద్యులు అతని శాంపిల్స్ తీసి కరోనా టెస్టింగ్‌కి పంపడంతో పాజిటివ్‌గా తేలింది. నరసరావుపేట నుంచి తొలి కరోనా కేసు నమోదైంది. అప్రమత్తమైన అధికారులు తక్షణం స్పందించి మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కి తరలించారు.

Read Also: గుంటూరులో విషాదం.. కరోనా స్పెషల్ డ్యూటీకి వస్తూ హోంగార్డు మృతి
కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిన మృతుడు నరసరావుపేట పట్టణంలోని వరవకట్ట ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న ఏరియా మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతంలో బ్యారికేడ్లను సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లో అధికారికంగా రెడ్‌జోన్‌గా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల్లో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళణ కలిగిస్తోంది. తాజాగా నరసరావుపేట పట్టణంలోనూ కరోనా కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదు కాగా నెల్లూరు జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.

Also Read: హత్యా? ఆత్మహత్యా? అపార్ట్‌మెంట్‌ పైనుంచి పడి యువతి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.