యాప్నగరం

కాకినాడలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై దుండగుల అఘాయిత్యం

కాకినాడలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై దుండగులు అత్యాచారం చేసి పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ అమానుష ఘటన స్థానికులను కలచివేస్తోంది.

Samayam Telugu 25 Nov 2020, 5:06 pm
నిర్భయ, దిశ వంటి కఠిన చట్టాలు తెచ్చినా.. రేపిస్టులకు ఉరిశిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అభంశుభం తెలియని చిన్నారులనూ మృగాళ్లు వదలడం లేదు. ఐదేళ్ల చిన్నారిపై అమానుషంగా అత్యాచారం చేసిన ఘటన తాజాగా ఏపీలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape


తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని గోలీలపేటలో ఐదేళ్ల బాలికపై దుండగులు దారుణంగా అత్యాచారం చేసి వదిలివెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున గోలీలపేట శివారులో రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని స్థానికులు గుర్తించారు. వెంటనే కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మైనర్‌ని గర్భవతిని చేసిన అత్త కొడుకు.. కేసు పెట్టనన్న బాలిక.! ఖాకీల షాకింగ్ ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.