యాప్నగరం

రేపు సీఎం జగన్ పర్యటన.. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

కర్నూలు వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంగళవారం సీఎం జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య ఫ్లెక్సీ రగడ మొదలైంది.

Samayam Telugu 17 Feb 2020, 3:53 pm
కర్నూలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంగళవారం (ఫిబ్రవరి 18) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కర్నూలులో సీఎం జగన్ కాన్వాయ్‌ వెళ్లే ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మెహన్‌రెడ్డి కూడా ఐదు రోడ్ల కూడలి నుంచి ప్రభుత్వ అతిథిగృహం మీదుగా బహిరంగ సభ వరకు సీఎంకు ఆహ్వాన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Samayam Telugu JAGAN


Also Read: ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ కేసులో ట్విస్ట్.. యువకుడి ఆత్మహత్యాయత్నం

అయితే ఆదివారం రాత్రి మున్సిపల్‌ అధికారులు ఈ ఫ్లెక్సీలను తొలగించి ట్రాక్టర్లలో తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్వీ మెహన్‌రెడ్డి, అయన అనుచరులు వచ్చి మున్సిపల్‌ అధికారులను, సిబ్బందిని ప్రశ్నించగా.. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగిస్తున్నట్లు వారు చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసు ఉన్నతాధికారులకు ఎస్వీ మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే పలు సందర్భాల్లో వీరిద్దరి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. సీఎం పర్యటన ముందు రోజే ఫ్లెక్సీల వివాదం మరింత నిప్పును రాజేసినట్లుయింది. కాగా, సీఎం జగన్మోహన్‌రెడ్డి హెలిప్యాడ్‌ నుంచి బహిరంగ సభకు వచ్చే కాన్వాయ్‌ మార్గంలో హోర్డింగ్‌లను తనను కాదని ఎవరికీ అద్దెకు ఇవ్వరాదని యాడ్స్‌ యాజమాన్యానికి ఎమ్మెల్యే చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: రాజకీయాలంటే రెండు కులాల మధ్య గొడవలా .. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.