యాప్నగరం

కృష్ణా జిల్లాలో వరద కష్టాలు.. అంత్యక్రియలకు తప్పని తిప్పలు

కృష్ణా జిల్లాలో వరద కష్టాలు.. అంత్యక్రియలు చేయడానికి స్థానికులకు ఇబ్బందులు. లారీ ట్యూబులపై కర్రలు కట్టి మృతదేహాన్ని స్మశానినికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Samayam Telugu 16 Aug 2019, 5:29 pm
ఎగువన కురిసిన వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది. ఈ వరదలతో కృష్ణా జిల్లాలోని చాలా గ్రామాలు నీట మునిగాయి. తోట్లవల్లూరు, చందర్లపాడు, కంచికచర్ల, జగ్గయ్యపేటతో పాటూ చాలా మండలాల్లో వరద దెబ్బకు వణికిపోతున్నాయి. గ్రామాలకు, గ్రామాలు నీటమునిగాయి. కృష్ణానది వరద నీటితో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారింది.

జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లుకు చెందిన రత్నం అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. అతడి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. కానీ మృతదేహం స్మశానానికి తీసుకెళ్దామంటే వరద నీరు గ్రామాన్ని చుట్టుముట్టింది. వరద నీటితో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గుతుందేమోనని ఆశగా ఎదురు చూశారు.. కానీ తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో నీళ్లల్లో లారీ ట్యూబులపై కర్రలతో కట్టి దానిపై మృతదేహాన్ని ఉంచి.. నీళ్లల్లో స్మశానానికి తీసుకెళ్లారు.

మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లినా.. చివరి చూపుకు బంధువులు, స్థానికుకలు వెళ్లలేకపోయారు. అందరూ అవతలి వైపు ఉండిపోయారు. తర్వాత స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన చిన్న బోటులో వాళ్లంతా స్మశానానికి వెళ్లారు. అక్కడి అంత్యక్రియల్ని ముగించారు. వరదలతో స్థానికులు పడుతున్న ఇబ్బందులకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.