యాప్నగరం

ప్రజల్ని పట్టించుకోకుండా జగన్ అమెరికాకు.. కొంప మునిగి బాబు హైదరాబాద్‌కు: కన్నా

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే రాష్ట్రంలో లేకుండా వెళ్లిపోయారని ఫైర్.

Samayam Telugu 17 Aug 2019, 1:45 pm

ప్రధానాంశాలు:

  • జగన్, బాబు తీరుపై ట్విట్టర్‌లో మండిపడ్డ కన్నా
  • ప్రజల బాగోగులు పట్టవా అంటూ ప్రశ్న
  • ఇద్దరి వల్ల రాష్ట్రం మునుగుతుందని విమర్శ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ys jagan.
కృష్ణా నదికి వరద పోటెత్తింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనలో ఉండటంతో.. ఏపీ మంత్రులే వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇటు ఇదే సమయంలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హైదరాబాద్ వెళ్లారు. అటు జగన్, ఇటు చంద్రబాబును ట్విట్టర్‌లో టార్గెట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.
ప్రజలు వరదలతో కష్టాలు పడుతుంటే.. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత రాష్ట్రం విడిచి వెళ్లిపోయారంటూ కన్నా మండిపడ్డారు. తోక నేతలు అంటూ ఘాటు ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో వరదల సమయంలో.. ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన 'కొంప మునిగి' హైదరాబాద్ జారుకున్నాడు.. వారిద్దరి 'తోక నేతలు'చేస్తున్న చర్చ"ఇల్లు మునిగిందా,లేదా"? ఇల్లు సంగతి వదిలేయండి మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోంది’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.