యాప్నగరం

జగన్ సర్కార్ సంచలనం.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సస్పెండ్

వైసీపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువరించింది.

Samayam Telugu 9 Feb 2020, 1:16 am
వైసీపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన డీజీపీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు గానూ ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Samayam Telugu ab


Also Read: జగన్, చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం

దేశభద్రతకు ముప్పు
ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ పని చేసిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ సంస్థ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్‌తో కుమ్మక్కై ఆయన కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని జీవోలో పేర్కొంది. విదేశీ సంస్థతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని తెలిపింది. నాణ్యత లేని నిఘా పరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని పేర్కొంది. కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్థానం కల్పించలేదని వివరించింది.

Also Read: ‘బాదుడే బాదుడు.. కేబుల్ బిల్లు భారీగా పెంచిన జగన్ సర్కార్’

1989 ఏపీ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు గత చంద్రబాబునాయుడు హయాంలో కీలక పదవులు నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం తప్పించింది. ఈసీ నిర్ణయంపై అప్పట్లో చంద్రబాబు తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట వెంకటేశ్వరరావును బదిలీ చేసిన ప్రభుత్వం.. పోస్టింగ్ ఇవ్వకుండా కొన్నాళ్లుగా వెయిటింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ అనుమతి లేనిదే విజయవాడలోని హెడ్ క్వార్టర్స్‌ను వీడి వెళ్లరాదని పేర్కొంది.

Also Read: సీఎం జగన్‌ను ఇరుకున పెట్టే అంశం ఎత్తుకున్న జనసేనాని.. వైసీపీకి ఇబ్బందులు తప్పవా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.