యాప్నగరం

నువ్వో హంతకుడివి.. నీతులు చెప్పకు.. మాజీ మంత్రిపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మ్యావ్ మ్యావ్‌లు ఆపేయ్. ఎంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవంటూ ట్వీట్ చేశారు.

Samayam Telugu 25 Jan 2020, 3:43 pm
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఎంత దోచుకున్నారో, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని రూ. వేల కోట్లు పోగేసుకున్నది త్వరలోనే బయటపడుతుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంత వరకు కాస్త ఓపికపట్టు ఉమా అంటూ చురకలంటించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.
Samayam Telugu VSR, DU


అలాగే మాజీ మంత్రి ఉమాపై ఎంపీ విజయసాయిరెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘‘మ్యావ్ మ్యావ్‌లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువ్వు నీతులు వల్లిస్తే ఎలా?’’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, శుక్రవారం విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలకు కౌంటర్‌గా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్‌ వేయనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమా శుక్రవారం తెలిపారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనేనని వ్యాఖ్యానించారు. అసలు అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డికి శాసన మండలిలో ఏం పని? అని ప్రశ్నించారు. శాసన మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

Also Read: Devineni Uma: విజయసాయిరెడ్డి ఇక జైలుకే.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.