యాప్నగరం

BJPలో చేరిన మాజీ మంత్రి.. టీడీపీకి మరో షాక్!

TDPకి మరో షాక్ తగిలింది. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. సెప్టెంబర్ 11నే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. సోమవారం కమలం గూటికి చేరారు.

Samayam Telugu 21 Oct 2019, 12:52 pm
కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన కమలం గూటికి చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న ఆయన.. బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలొచ్చాయి. వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి సెప్టెంబర్ 11నే టీడీపీకి రాజీనామా చేశారు. మరుసటి రోజు ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీ మారడం ఆలస్యమైంది.
Samayam Telugu adi narayana reddy


ఢిల్లీ వెళ్లిన ఆదినారాయణ రెడ్డి సోమవారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ గూటికి చేరారు. ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫన ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కొద్ది రోజులకే బాబు సన్నిహితుడిగా మారిన ఆయన.. మంత్రి పదవిని పొందారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన తన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డితో విబేధాలను పక్కనబెట్టారు. 2019 ఎన్నికల్లో ఆయన కడప నుంచి పోటీ చేసి ఓడారు.

ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఆదినారాయణరెడ్డి వ్యవహరించారు. జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. టీడీపీలో ఉంటే తాను టార్గెట్ కావడం ఖాయమని భావించిన ఆయన.. బీజేపీ గూటికి చేరారని ప్రచారం జరుగుతోంది. ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఆలస్యం కావడానికి ఎంపీ సీఎం రమేశ్ కారణమని గుసగుసలు వినిపించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.