యాప్నగరం

చిత్తూరులో కలకలం.. వ్యవసాయ బావిలో 4 శవాలు

చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలంలో వ్యవసాయ బావిలో నాలుగు శవాలు పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది.

Samayam Telugu 22 Mar 2020, 12:15 am
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారి పల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. నాలుగు మృతదేహాల్లో ఒకరు మహిళ కాగా.. మిగిలిన ముగ్గురు పదేళ్లలోపు చిన్నారులు. మరణించిన చిన్నారుల్లో ఒక బాలుడు కాగా, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu dead bodies


బావిలో పడి ఉన్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని ఈ మృతదేహాలను పోలీసులు బావిలో నుంచి బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు స్థానికేతరులని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన తల్లీపిల్లలుగా పోలీసులు భావిస్తున్నారు. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఇంకేదైనా కారణం ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలన్నీ ఉబ్బిపోయిన స్థితిలో ఉన్నాయి. దీంతో వారు చనిపోయి రెండు, మూడు రోజులై ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.