యాప్నగరం

తూ.గో: రావులపాలెం దగ్గర ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

రావులపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొట్టుకొని నలుగురు మృతి. ప్రమాదం దెబ్బకు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Samayam Telugu 15 Jan 2020, 4:09 pm
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి.. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం బాధితుల్ని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం దెబ్బకు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
Samayam Telugu rjy.


Read Also: పండగపూట విషాదం.. తండ్రి తిట్టాడని కొడుకు ఆత్మహత్య

ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనలో ఓ కారు ఇంజిన్‌ ఊడి బయటకు వచ్చేసింది అంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ వైపుగా వెళుతున్న కారు ఒక్కసారిగా డివైడర్‌ దాటి దూసుకొచ్చింది. అవతలివైపు రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారట. ప్రమాదానికి కారణమైన కారులో వ్యక్తులు మద్యం సేవించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పండుగ రోజు నలుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.