యాప్నగరం

కడపలో విషాదం.. పెన్నానదిలో మునిగి నలుగురి మృతి

కర్ణాటకలో పాఠశాలలకు సెలవులు కావడంతో ముంతాజ్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని తమ్ముడి వద్దకు వచ్చింది. పెన్నానది చూసొద్దామని వెళ్లిన నలుగురు నీటమునిగి చనిపోయిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

Samayam Telugu 2 Jan 2020, 9:55 pm
ఈత సరదా నలుగురిని మింగేసింది. స్కూల్ సెలవులను సరదాగా గడుపుదామని రాష్ట్రం దాటి మరీ మేనమామ వద్దకు వచ్చిన చిన్నారులు నదిలో ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఒకరి కోసం మరొకరు నీటిలో దిగి మృత్యువాతపడ్డారు. చిన్నారులు నీటముగనడం చూసి తన అక్క బిడ్డలను ఎలాగైనా రక్షించాలని యత్నించి నీటిలో మునిగి చనిపోయిన విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu drowned in water


కర్ణాటకలోని రాయచూర్‌కి చెందిన ముంతాజ్.. కడపలోని ప్రకాశ్ నగర్‌లో ఉంటున్న తన తమ్ముడు అన్వర్ వద్దకు వచ్చింది. కర్ణాటకలో పాఠశాలలకు సెలవులు కావడంతో ముగ్గురు పిల్లలు మదియా, పరియా, జోహాన్‌‌లను వెంటతీసుకొచ్చింది. సరదాగా పిల్లలను తీసుకుని మేనమామ అన్వర్ కడప సమీపంలోని సిద్ధవటం వద్ద పెన్నానది చూసేందుకు వెళ్లాడు.



Also Read: వదినపై అత్యాచారం చేసి.. ఆపై మర్మాంగాన్ని కోసేసి.. కృష్ణా జిల్లాలో ఘోరం

ఈత కొట్టేందుకు నదిలో దిగిన నలుగురూ నీటమునిగి మృత్యువాతపడ్డారు. తొలుత మదియా, పరియా నీటమునిగారు. గమనించిన జోహాన్ వారిని బయటకు లాగేందుకు యత్నించి నీటముగినింది. పిల్లలు మునిగిపోవడం చూసిన అన్వర్ వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అన్వర్ కూడా నీటమునిగి ప్రాణాలొదిలాడు. సరదాగా గడుపుదామని వచ్చి ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు సహా మేనమామ నీటమునిగి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.