యాప్నగరం

కడప: కారును ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

కడప జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మృతులు కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Samayam Telugu 11 Dec 2019, 12:58 pm
కడప జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. రామాపురం మండలం చిట్లూరు వద్ద కారును లారీ ఢీకొంది. దీంతో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులను రాయచోటికి చెందిన హర్షద్‌ఖాన్‌, హసజీరా, చిత్తూరు జిల్లా కలికిరి మండలానికి చెందిన హారున్‌బాషా, అఫిరాలుగా గుర్తించారు. వీరంతా ప్రొద్దుటూరులో ఓ కార్యక్రమానికి హాజరయి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Samayam Telugu kad


ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. లారీ డ్రైవర్‌ కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఐదు రోజుల కిందట రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ సహా ముగ్గురు మరణించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుటుంబం తమ చిన్నారి పుట్టువెంట్రుకలు సమర్పించి మొక్కు తీర్చుకునేందుకు కారులో తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.