యాప్నగరం

Pawan Kalyan ‌పై రూ. 100 కోట్ల బెట్టింగ్: కాపులు Vs రాజులు.. పాపం, ఆ కులస్తులు బలి!

Pawan Kalyan Gajuwaka: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లడించారు.

Samayam Telugu 3 Dec 2020, 11:02 am
గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించారు తిప్పల నాగిరెడ్డి. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తారన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ 16 వేల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల సందర్భంగా అప్పడు జరిగిన పరిణామాలపై తిప్పల నాగిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆనాడు జరిగిన పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపుపై రూ. 100 కోట్ల బెట్టింగ్ జరిగిందని స్వయంగా ప్రకటించి నాగిరెడ్డి సంచలనం రేపారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


Don't Miss: అసెంబ్లీలో ‘చంద్రన్న భజన’ పాట.. జగన్ నవ్వి నవ్వి అలిసిపోయి, చివరికి!

నాగిరెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘గత ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన తర్వాత మీటింగ్ పెట్టారు. విశాఖపట్నం జిల్లాలో జనసేన తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులను, ఆ పార్టీ కేడర్ మొత్తాన్ని రప్పించారు. అయితే, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన వారిలో పావు శాతం కూడా పవన్ సమావేశానికి రాలేదు. అప్పుడే నాకు, మా కేడర్‌కు పవన్ ఓడిపోతారనే నమ్మకం ఏర్పాడింది.
పవన్ తరఫున పనిచేయడానికి వచ్చిన వారు కూడా సర్వే చేసుకుని మనోడు ఓడిపోతాడంటూ ఎన్నికలకు మూడు రోజుల ముందే లాడ్జీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎన్నికల తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో రాజు కులస్తులు వాళ్లంతట వాళ్లే సర్వే చేసుకుని నేను గెలవబోతున్నానని రూ. 100 కోట్ల బెట్టింగ్ వేశారు. అప్పుడు రాజులు వర్సెస్ కాపుల మధ్య రూ. 100 కోట్ల బెట్టింగ్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా తూర్పు గోదావరిలోని మా ఫ్రెండ్స్ ఫోన్ చెప్పారు. మీరు గెలుస్తారని రూ. 100 కోట్లు పందెం వేసి మా వాళ్లు గెలిచారని చెప్పారు.’’ అని వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెల్లడించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్‌ గెలుపుపై నమ్మకంతో కాపు కులస్తులు రూ. 100 కోట్లు బెట్టింగ్ కాసి నష్టపోయారు. రూ. 100 కోట్లు గెలుపొందిన రాజు కులస్తులు తనకు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని ఎమ్మెల్యే నాగిరెడ్డి సంచలన విషయాలు చెప్పారు.

Read Also: పవన్ కళ్యాణ్‌‌తో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి భేటీ.. జనసేనాని పర్యటనలో ఇదే హైలెట్!
Must Read: టీడీపీ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన స్పీకర్ తమ్మినేని.. వరుసగా మూడో రోజు కూడా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.