యాప్నగరం

విజయవాడ: అర్ధరాత్రి డాక్టర్లపై దాడి చేసి, బైక్ తగలబెట్టి..

విజయవాడ శివారులోని ప్రసాదంపాడులో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. డాక్టర్లపై దాడి చేసి ఓ వైద్యుడి బైక్‌ను దగ్ధం చేశారు.

Samayam Telugu 1 May 2020, 4:06 pm
కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారులోని ప్రసాదంపాడులో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయి. గురువారం అర్ధరాత్రి గంజాయి ముఠా వైద్యులపై దాడులకు తెగబడింది. అడ్డుకోబోయిన ఒక వైద్యుడి బైక్‌ను వారు దగ్ధం చేశారు. మరో వైద్యుడు కారులో వస్తుండగా దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Samayam Telugu తగలబడుతున్న డాక్టర్ బైక్


గంజాయి ముఠా ఆగడాలతో ప్రసాదంపాడు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో విజయవాడ నగరం బ్లేడ్ బ్యాచ్, గంజాయి ముఠా ఆగడాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత లాక్ డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమైన తరుణంలో ఈ ముఠా మత్తులో జోగుతూ పలువురిపై దాడులకు పాల్పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

కాగా, గంజాయి సేవించిన ముఠా ఆ మత్తులో ఒకరిపై మరొకరు దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిలో వారు గొడవపడుతూ అడ్డొచ్చిన వారిపై సైతం దాడులకు పాల్పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.