యాప్నగరం

జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ.. అసెంబ్లీ సమావేశాలకు ముందే..

మంత్రి కొడాలి నానితో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎంను వంశీ కలవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.

Samayam Telugu 26 Nov 2019, 4:14 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నానితో కలిసి జగన్‌‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటూ పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండటంతో జగన్-వంశీ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలయ్యింది.
Samayam Telugu vamsi


అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిచేందుకు వంశీ సీఎం జగన్‌తో సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా.. అసెంబ్లీలో తనను ప్రత్యేకంగా గుర్తించమని అడుగుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత నెలలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తర్వాత దీపావళి సమయంలో వంశీ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబుకు వాట్సాప్‌లో తన రాజీనామా లేఖను పంపించారు. తర్వాత చంద్రబాబు ఇసుక కొరతపై దీక్ష చేస్తున్న రోజే వంశీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబు, లోకేష్‌లపై ఆరోపణలు చేశారు. టీడీపీలో కొనసాగే పరిస్థితి తనకు లేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వెంట నడుస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం, వైఎస్సార్‌సీపీలో చేరడంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ సీఎంను కలవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిరేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.