యాప్నగరం

జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే.. వెంటబెట్టుకెళ్లిన మంత్రి

ఉదయం బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిసిన వల్లభనేని వంశీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం. వంశీ వైఎస్సార్‌సీపీలోకి వెళతారంటూ మళ్లీ ప్రచారం.

Samayam Telugu 25 Oct 2019, 5:39 pm
టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో భేటీ అయ్యారు. వంశీని మంత్రి పేర్ని నాని వెంటబెట్టుకొని తీసుకెళ్లారని తెలుస్తోంది. వల్లభనేని జగన్‌ను కలవడంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్‌ కలిశారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
Samayam Telugu జగన్


Read Also: BJP ఎంపీతో టీడీపీ ఎమ్మెల్యే భేటీ

అంతేకాదు వంశీ ఉదయం గుంటూరులో ఎంపీ సుజనా చౌదరిని కలిశారు. ఒంగోలు వెళుతూ గుంటూరులో ఆగిన సుజనాను కలిసిన వంశీ.. కొద్దిసేపు సమావేశమయ్యారు. తర్వాత ఒకే కారులో ఇద్దరూ కలిసి ఒంగోలు వెళ్లినట్లు తెలుస్తోంది. వంశీ సుజనానకు కలవడం.. సమావేశం కావడం.. ఒకే కారులో వెళ్లడం ఆసక్తికరంగా మారింది. వంశీ పార్టీ మారబోతున్నారా అంటూ మళ్లీ ప్రచారం మొదలయ్యింది.

వంశీపై కొద్ది రోజుల క్రితమే ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి.. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తనపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని వల్లభనేని చెప్పారు. ఈ క్రమంలో గురువారం అనుచరులు, అభిమానులతో నియోజకవర్గంలో సమావేశమయ్యారు. దీంతో ఆయన పార్టీ మారతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.. ఆయన మాత్రం పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారట. అంతేకాదు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఇసుక కొరతను నిరసిస్తూ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా వల్లభనేని సుజనాను, ఆ వెంటనే జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.