యాప్నగరం

సీఎం సహాయనిధికి భారీ విరాళం.. సీఎం జగన్‌కు అందజేసిన చెన్నై కంపెనీ ప్రతినిధులు

ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కోటి రూపాయిల చెక్ అందజేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 16 Aug 2022, 10:17 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి చెందిన ఇంపీరియల్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జెమ్‌ గ్రానైట్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ. 1,05,00,000 (రూ. కోటి ఐదు లక్షల) డీడీని అందజేశారు.
Samayam Telugu సీఎం జగన్‌కు డీడీ అందజేస్తున్న కంపెనీ ప్రతినిధులు



ఈ సందర్భంగా జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఛైర్మన్‌ ఆర్‌.వీరమణి మాట్లాడుతూ.. కోవిడ్‌ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు స్వయంగా వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ ఆర్‌.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.