యాప్నగరం

సీఎం జగన్‌తో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్‌ భేటీ!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ కుచ్లర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను సీఎం జగన్ వివరించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 25 May 2023, 1:04 am
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భారత్‌లో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌ భేటీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Samayam Telugu సీఎం జగన్‌తో జర్మనీ కాన్సుల్ జనరల్‌ భేటీ


అయితే, మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌, ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, రెన్యూవబుల్‌ ఎనర్జీ వంటి వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్ వివరించారు. ఏపీని ఫోకస్డ్‌ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.


కాగా, విశాఖలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్-2023)ను నిర్వహించిన విషయం విదితమే. 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని.. ఓవరాల్‌గా రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు గతంలో సీఎం జగన్ వివరించారు. ఇక, పెట్టుబడులకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనలో ఆలస్యం చేయరాదన్నారు. తమ నుంచి పారిశ్రామికవేత్తకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాము చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని, పర్యావరణ హిత ఇంధన, శక్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు పాటు పడుతున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చి దిద్దడమే తమ లక్ష్యమని జీఐఎస్‌ విజయవంతం అయిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.