యాప్నగరం

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ విజ్ఞ‌ప్తి.. రాజధానిపై మీ అభిప్రాయాలు చెప్పండిలా

Gn Rao Expert Committee| ఏపీ రాజధాని అంశంపై మరో కీలక నిర్ణయం. అభిప్రాయ సేకరణ ప్రారంభించిన జీఎన్ రావు కమిటీ. మెయిల్, లేఖల ద్వారా ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరిన కమిటీ.

Samayam Telugu 28 Oct 2019, 6:35 pm
ఏపీ రాజధానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇక రాజధానిపై అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యింది. కొద్ది రోజుల క్రితమే ఈ కమిటీ సమావేశంకాగా.. తాజాగా ప్రజాభిఫ్రాయ సేకరణ ప్రారంభించింది. రాజధాని నిర్మాణం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరిన నిపుణుల కమిటీ కోరింది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది.
Samayam Telugu jagan.


రాజధానిపై అభిప్రాయాలు తెలియజేయాలనుకున్నవాళ్లు.. ఈ-మెయిల్ లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు కమిటీ కోరింది. అభిప్రాయాలను చెప్పదలచుకున్నవారు.. expertcommitee2019@gamail.com అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు. విజయవాడలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి లేఖల్ని పోస్టులో పంపాలి. సూచనలు పంపించేందుకు నవంబర్ 12 వరకు గడువుగా నిర్ణయించారు.

గత రెండు మూడు నెలలుగా రాజధాని అంశంపై గందరగోళంగా ఉంది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిపై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. అమరావతి సహా రాష్ట్రంలోని పట్టణాల పురోగతిపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావును నియమించారు. సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీమోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలంలు ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర సమగ్ర పురోగతి కోసం ఈ నిపుణుల కమిటీ పని చేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.