యాప్నగరం

గోదావరి దుర్ఘటన.. సీఎం జగన్ ఏరియల్ సర్వే, బాధితులకు ఓదార్పు

గోదావరి ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడ జరుగుతున్న గాలింపు చర్యలను సీఎం పర్యవేక్షించారు. అనంతరం రాజమండ్రిలో బాధితులతో మాాట్లాడారు.

Samayam Telugu 16 Sep 2019, 11:39 am
Samayam Telugu jagan aereal survey.
తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎంతోపాటు హోం మంత్రి సుచరిత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్న గాలింపు చర్యలను ఏరియల్‌ సర్వే ద్వారా సీఎం పరిశీలించారు.

అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను జగన్ పరామర్శించారు. బోటు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ సర్కారు ఇప్పటికే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

బోటు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. ఆదివారం 8 మృతదేహాలను వెలికి తీయగా.. సోమవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు రాష్ట్రంలో బోట్లు నడపొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

Read Also: భద్రాచలం వైపు నుంచి పాపికొండలు యాత్రను ఆపేయడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.