యాప్నగరం

గోదావరి బోటు ప్రమాదం : మరో మృతదేహం గుర్తింపు

ఎక్కువ మంది మునిగిన బోటులోనే చిక్కుకుపోయే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోటును వెలికితీసేందుకు అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నారు.

Samayam Telugu 17 Sep 2019, 10:41 am
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. సహాయక బృందాలు మంగళవారం మరో మృతదేహాన్ని గుర్తించాయి. దీంతో గల్లంతైన వారిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. కాఫర్ డ్యాం వద్ద మరో మృతదేహం ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాఫర్ డ్యాం వద్దకు బయలుదేరి వెళ్లాయి.
Samayam Telugu kakinada.


పర్యాటకులతో పాపికొండలకు బయలుదేరిన లాంచి గోదావరి ఉధృతికి కచలూరు వద్ద బోల్తా పడింది. బోటు మునిగిపోవడంతో పర్యాటకులంతా చెల్లాచెదురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 73 మంది బోటులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 27 మంది లైఫ్ జాకెట్లు, స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గోదావరిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో 46 మంది గల్లంతు కాగా నిన్నటి వరకు 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ రోజు మరో మృతదేహం లభ్యమైంది. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Must Read:లాంచీ ప్రమాదం: 15మందికిపైగా ప్రాణాలు నిలబెట్టిన తూటిగుంట స్థానికులు

తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి వద్దే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులుగా గాలింపు చేపట్టినప్పటికీ ఇప్పటికి 9 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఎక్కువ మంది మునిగిన బోటులోనే చిక్కుకుపోయే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోటును బయటికీ తీస్తే మరికొంత మంది మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read: గోదావరి దుర్ఘటన.. సీఎం జగన్ ఏరియల్ సర్వే, బాధితులకు ఓదార్పు

బోటును వెలికితీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. అధునాతన పరికారాలతో బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గోదావరిలో సుమారు 315 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సుమారు 600 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.