యాప్నగరం

బోటు ప్రమాదం: ముమ్మరంగా ఆపరేషన్ రాయల్ వశిష్ట

Operation Royal Vasista| బోటు కోసం కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట పనులు నిలిపివేత.. లంగరుకు తగిలిన బలమైన వస్తువు. దానిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తుండగా.. ఆపరేషన్‌ను నిలిపివేయాలని ఆదేశాలు.

Samayam Telugu 17 Oct 2019, 6:10 pm
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసేందుకు కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం కొద్దిసేపు పనులు నిలిచిపోయాయి. కాకినాడ పోర్టు నుంచి వచ్చిన నిపుణుల పర్యవేక్షణలో ఈ వెలికితీత పనులు మళ్లీ కొనసాగించారు. లంగరుకు తగిలిన బలమైన వస్తువును బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు.
Samayam Telugu kkd


మూడు రోజులుగా ధర్మాడి సత్యం టీమ్ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బుధవారం వేసిన పెద్ద లంగరుకు బలమైన ఓ వస్తువు తగిలింది. అది బోటు అని సత్యం టీమ్ భావించింది. రోప్‌ల సాయంతో దానిని బయటకు లాగుతున్నారు.. రోప్ మరింత బిగియడంతో జేసీబీల సాయంతో బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. గురువారం కూడా అదే ప్రయత్నాన్ని కొనసాగించారు.

రెండు వారాల క్రితం సత్యం టీమ్ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నించింది. అప్పుడూ కూడా బలమైన వస్తువుకు లంగర్ తగిలింది.. అది బోటుగా భావించినా ఫలితం దక్కలేదు. దాదాపు నాలుగైదు రోజుల పాటూ ప్రయత్నాలు కొనసాగాయి.. ఆ వెంటనే గోదావరికి వరద ఉధృతి పెరగడంతో బోటు బయటకు తీసే ప్రయత్నాలు టీమ్ తాత్కాలికంగా నిలిపివేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించారు.

బోటు మునిగిన కొద్దిరోజులకు ముంబై, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్‌లు బయటకు తీసేందుకు ప్రయత్నించాయి. టెక్నాలజీ సాయంతో బోటును ఎలాగైనా బయటకు తీసుకురావాలని చూశారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో.. చివరిగా ధర్మాడి సత్యం టీమ్‌కి ఈ బాధ్యతల్ని అప్పగించారు. ప్రభుత్వం రూ.22 లక్షల కాంట్రాక్ట్‌ చేసుకున్న సంగగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.