యాప్నగరం

తల్లి కాళ్లు పట్టుకొని వేలాడినా.. ఆ పసిదాన్ని వరద గోదారి తనలోకి లాగేసుకుంది..

తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేయడానికి వెళ్లారు. కానీ బోటు బోల్తా పడటంతో సుబ్రహ్మణ్యం, ఆయన కూతురు గల్లంతయ్యారు. భార్య మాత్రం ప్రాణాలను కాపాడుకోగలిగారు.

Samayam Telugu 16 Sep 2019, 11:25 am
గోదావరిలో బోటు బోల్తా పడటంతో.. విహార యాత్రకు వెళ్లిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు ప్రకృతి అందాలను తిలకిస్తూ.. సరదాగా గడిపిన వారంతా.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో తిరుపతి అక్కారంపల్లికి చెందిన సుబ్రహ్మణం ఆయన కుమార్తె హాసిని గల్లంతయ్యారు. తండ్రి అస్థికలను గోదావరిలో కలపడం కోసం భార్య మధులత, ఏడో తరగతి చదువుతోన్న కుమార్తెతో కలిసి సుబ్రహ్మణం పాపికొండలు ప్రాంతానికి వచ్చారు.
Samayam Telugu tirupati family


కాగా దేవీపట్నం సమీపంలో బోటు బోల్తా పడటంతో.. సుబ్రహ్మణం, ఆయన కుమార్తె గల్లంతయ్యారు. మధులతను స్థానికులు కాపాడి మరో బోటులో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించిందేందుకు మంత్రి కన్నబాబు వెళ్లగా.. తన బిడ్డను, భర్తను కోల్పోయిన తీరును తలుచుకొని మధులత గుండెలు అవిసేలా ఏడ్చింది.

‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా కూతురు నా కాళ్లను పట్టుకుని వేలాడింది. అయినా నా బిడ్డను కాపాడుకోలేకపోయా. పడవ బోల్తా పడగానే.. మా ఆయన నీటిలో మునిగిపోతున్న హాసినిని, నన్ను పైకి నెట్టారు. తను లైఫ్ జాకెట్ అందించడంతో ప్రమాదం నుంచి నేను బయటపడ్డాను. కానీ బిడ్డను మాత్రం కాపాడుకోలేయా. కళ్ల ముందే మా ఆయన నీటిలో మునిగిపోయారు. పాప స్కూల్ పిల్లలతో కలిసి జూపార్క్‌కు వెళ్తానంది.. కానీ మేమే బలవంతంగా గోదావరికి తీసుకెళ్లి తప్పు చేశామ’’ని మధులత వాపోయింది.

Read Also: భద్రాచలం నుంచి పాపికొండలు యాత్రను ఆపేయడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.