యాప్నగరం

కూతురిలా ఉన్నావంటూ పక్క సీట్లో కూర్చుని.. చేతికి పని చెప్పాడు..

ప్రయాణంలో అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మితే ఇబ్బందులు తప్పవని రుజువు చేస్తున్న ఘటన విజయవాడ మహిళకు ఎదురైంది. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిసి ఇచ్చి తన పని చేసుకుపోయిన వృద్ధుడు.

Samayam Telugu 3 Nov 2019, 7:42 pm
ఊరెళ్లేందుకు బస్సెక్కిన మహిళ వద్దకు ఓ పెద్దాయన వచ్చాడు. అమ్మా నువ్వు అచ్చు నా కూతురిలానే ఉన్నావంటూ దగ్గరయ్యాడు. పక్క సీట్లోనే కూర్చున్నాడు. పాపం నమ్మింది కదా.. ఇక మాటల మత్తులో దింపి తన పని చేసుకుని బస్సు దిగి వెళ్లిపోవడంతో ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రయాణంలో గుడ్డిగా నమ్మితే ఇబ్బందులు తప్పవని రుజువు చేస్తున్న ఈ ఘటన విజయవాడ మహిళకు ఎదురైంది.
Samayam Telugu istock-625691236


విజయవాడ మొగల్రాజపురానికి చెందిన రమణాయమ్మ స్వస్థలం విశాఖపట్నం. పనుల మీద ఇటీవల ఆమె విశాఖపట్నం వెళ్లారు. తిరిగి విజయవాడ వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఇంతలో ఆమెకు పరిచయం లేని ఓ వృద్ధుడు ఆమె వద్దకు వచ్చి తన పక్క సీట్లోనే కూర్చున్నాడు. తన కూతురిలా ఉన్నావంటూ రమణాయమ్మతో మాటలు కలిపాడు.

Also Read: వామ్మో మామూలుగా లేదుగా.. పులితో ఆటలాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే..

భోజనాల కోసం బస్సు ఆపినప్పుడు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తెచ్చి ఇచ్చాడు. నీరసంగా కనిపిస్తున్నావు తాగమ్మా అంటూ బలవంత పెట్టడంతో మొహమాటంతో రమణాయమ్మ కూల్‌డ్రింక్ తాగింది. తాగి కాసేపటికే ఆమె నిద్రలోకి జారుకుంది. ఉదయం విజయవాడ వచ్చినా ఆమె నిద్ర లేవకపోవడంతో డ్రైవర్ వెళ్లి రమణాయమ్మను నిద్ర లేపాడు.

అప్పుడు కానీ ఆమెకు విషయం తెలియలేదు తన మెడలోని బంగారు చైను, పర్సులోని నగదు, రెండు సెల్‌ఫోన్లు అపహరణకు గురయ్యాయని. తనకు మత్తు మందు ఇచ్చి చేతివాటం చూపించినట్లు గ్రహించిన రమణాయమ్మ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.