యాప్నగరం

కరోనా శవాలనూ వదలని దుర్మార్గులు.. విజయనగరంలో ఘోరం

మార్చురీ సిబ్బంది ముందు మృతదేహాన్ని చూపించకుండా తరలించేందుకు ప్రయత్నం చేశారు. స్మశానంలో డెడ్‌బాడీని చూసి షాక్ తిన్నారు. అప్పుడు అసలు విషయం బయటపడింది.

Samayam Telugu 27 Aug 2020, 9:44 am
కరోనా సమయంలో కూడా కొంతమంది కక్కుర్తిగాళ్లు రెచ్చిపోతున్నారు. వైరస్‌తో చనిపోయిన వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తున్నారు. విజయనగరంలో జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. వీరఘట్టం మండలం ఏమ్ రాజపురంకు చెందిన సరస్వతీ అనే మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ మహిళ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కరోనాతో చనిపోయిన సరస్వతి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అంత్యక్రియలకు సంబందించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Samayam Telugu విజయనగరం జిల్లాలో దారుణం


మార్చురీ సిబ్బంది ముందు మృతదేహాన్ని చూపించకుండా తరలించేందుకు ప్రయత్నం చేశారు. స్మశానంలో మృతదేహాన్ని బయటకు తీయగా.. ఆమె ఒంటిపై ఉండాల్సిన బంగారం కనిపించ లేదు. ఐదు తులాలు విలువజేసే బంగారు గొలుసు, ఉంగరాలు మాయమైంది. దీంతో విషయం బయటపడింది. బంధువులు వెంటనే చనిపోయిన మహిళ వద్ద ఉన్న బంగారం మొత్తం మాయమైందని ఆస్పత్రి వారికి ఫిర్యాదు చేశారు. ఏం జరిగిందని ఆరా తీస్తే మార్చురీ సిబ్బంది చేతివాటం ఉపయోగించారని తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.