యాప్నగరం

ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. మద్దతు ధరలపై సంచలన ప్రకటన

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మద్దతు ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. నూతన కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి నాని వెల్లడించారు.

Samayam Telugu 27 Dec 2019, 4:28 pm
పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు లేక అల్లాడుతున్న రైతన్నలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కొత్త విధానం తీసుకురానున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి.. పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి నూతన కొనుగోళ్ల విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
Samayam Telugu ap farmers


నూతన విధానంలో కనీస మద్ధతు ధరకు నోచుకోని పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాలకు ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటిస్తుందని మంత్రి తెలిపారు. ఏటా పంట చేతికొచ్చే ముందే ప్రభుత్వం ధరలు ప్రకటిస్తుందని.. అవే ధరలకు రాష్ట్ర ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నుట్లు చెప్పారు.

Also Read: తండ్రి బాటలో తనయుడు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రంలోని 191 మార్కెట్ యార్డులు.. 150 ఉప మార్కెట్ యార్డుల్లో శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం కోతల సమయంలోనే కాకుండా 365 రోజులు కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉండేలా నిర్ణయించామన్నారు మంత్రి.

రాష్ట్రంలో పసుపు, మిర్చి తదితర వాణిజ్య పంటలకు మద్దతు ధరల్లేక రైతులు దిగాలు చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కనీస గిట్టుబాటు ధరలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఉపశమనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కొనుగోళ్ల వాధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి నాని పేర్కొన్నారు.

Read Also:
ఏపీకి మూడు రాజధానులు.. రంగంలోకి అమిత్ షా.?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.