ఏపీపై అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది.. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంతగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీగా వానలు పడతాయంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. దీంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఉదయం నుంచి భోగాపురం, పూసపాటిరేగలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని.. ఒడ్డున ఉన్న పడవలను వెనక్కి తీసుకురావాలని అధికారులు సూచించారు. కెరటాలు ముందుకు రావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావం కావొచ్చని చర్చించుకుంటున్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 5, 6, 7, 8, 9న భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలు కురిస్తే వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. తీర గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రవాహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. పంట పొలాల్లో పురుగు, కలుపు మందులు పిచికారీ చేయాల్సిన రైతులు వాయిదా వేసుకోవాలని శాస్త్రవేత్త స్రవంతి సూచించారు.
మరోవైపు అల్పపీడనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ విజయసునీత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. వంశధార, నాగావళి నదుల్లోని నీటి ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రజలు సముద్ర స్నానాలకు వెళ్లొద్దని.. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా మంగళవారం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి చిరు జల్లులు కురుస్తాయంటున్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 5, 6, 7, 8, 9న భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలు కురిస్తే వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. తీర గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రవాహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. పంట పొలాల్లో పురుగు, కలుపు మందులు పిచికారీ చేయాల్సిన రైతులు వాయిదా వేసుకోవాలని శాస్త్రవేత్త స్రవంతి సూచించారు.
మరోవైపు అల్పపీడనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ విజయసునీత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. వంశధార, నాగావళి నదుల్లోని నీటి ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రజలు సముద్ర స్నానాలకు వెళ్లొద్దని.. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా మంగళవారం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి చిరు జల్లులు కురుస్తాయంటున్నారు.