యాప్నగరం

విజయవాడలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన గవర్నర్

ఏపీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరేశారు.

Samayam Telugu 26 Jan 2020, 10:04 am
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌తోపాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గవర్నర్.. ప్రభుత్వ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
Samayam Telugu guv ap


రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మనరాజ్యాంగం ఒకటి. దేశపౌరుల హక్కులను పరిరక్షించడంలో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించింది. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులను స్మరించుకుంటూ దేశపౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని జగన్ ట్వీట్ చేశారు.

మూడు రాజధానుల ప్రకటన చేసిన సీఎం జగన్.. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని భావించారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కూడా ఆదేశించారు. కానీ రాజధానిని తరలించొద్దని అమరాతి ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.