యాప్నగరం

టీటీడీ ఉద్యోగికి కరోనా.. గోవిందస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయంలో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Samayam Telugu 12 Jun 2020, 6:03 pm
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయానికి కరోనా వైరస్ సెగ తాకింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో శ్రీ గోవింద‌రాజ‌ స్వామి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సదరు ఉద్యోగికి కరోనా పరీక్షలు చేయించుకోగా అందులో పాటిజివ్‌ వచ్చినట్లు ప్రకటనలో వెల్లడించింది.
Samayam Telugu గోవిందస్వామి ఆలయం


ఆలయంతో పాటు ఉద్యోగి తిరిగిన ప్రాంతాలను రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉద్యోగితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా ప్రొటోకాల్‌ మేరకు రెండు రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసిన అనంతరం ఆదివారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ రెండు రోజులపాటు స్వామివారి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటనలో టీటీడీ వెల్లడించింది. 2 రోజుల పాటు ఆల‌యాన్ని పూర్తిగా శుద్ధి చేసిన త‌ర్వాత ఆదివారం నుంచి య‌థావిధిగా భ‌క్తుల‌కు ద‌ర్శనం క‌ల్పించనున్నట్లు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.