యాప్నగరం

ఏపీ: ఆడపిల్ల పుడితే అకౌంట్‌లో డబ్బులు జమ.. పథకం పూర్తి వివరాలివే

Pradhan Mantri Matru Vandana Yojana Pmmvy Scheme Changes కేంద్రం ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు ఉన్నాయి. మహిళల కోసం కూడా స్పెషల్‌గా స్కీమ్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో గర్భిణీ స్త్రీలకు కూడా ఒక పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన.. పథకంలో కొన్ని మార్పులు జరిగాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 9 Jun 2023, 12:43 pm

ప్రధానాంశాలు:

  • ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన
  • పథకంలో మరో మార్పు చేసిన ప్రభుత్వం
  • రెండో కాన్పునకు కూడా ఆర్థిక సాయం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu PMMVY Scheme
కేంద్రం మిషన్‌ శక్తి కింద కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహిళలు రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.ఆరు వేలు ఆర్థిక సాయంగా అందజేస్తోంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై) కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుడితే మూడు దశల్లో రూ.5వేలు చెల్లిస్తోంది. ఈ పథకానికయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తారు.
ఈ పథకంలో రెండో కాన్పునకు ఆర్థిక లబ్ధి వర్తించేది కాదు.. ఇప్పుడు దానిని సవరిస్తూ.. రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ.6వేలు ఇచ్చేలా మార్పుచేశారు. రెండో ప్రసవంలో కవలలు జన్మించి, వారిలో ఒక అమ్మాయి ఉన్నా పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద మొదటిసారి మహిళ గర్భం దాల్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదుకాగానే రూ.1,000 ఇస్తారు. అలాగే ఆరు నెలల తర్వాత రూ.2 వేలు.. ప్రసవం జరిగిన 14 వారాల్లో ఇమ్యూనైజేషన్‌ సైకిల్‌ పూర్తయ్యాక రూ.2,000 చొప్పున అందజేస్తారు.

ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద గర్భవతులైన మహిళలు సద్వినియోగంచేసుకోవాలని ఏపీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. గర్భవతులైన మహిళలు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, నకళ్ళతో 12 వారాల లోపు తమ పేర్లను ఆస్పత్రుల్లో నమోదు చేసుకుంటే విడతలవారీగా వారి ఖాతాల్లో రూ.ఐదు వేలు జమ అవుతాయి అని చెప్పారు.
అర్హులైన వారికి జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా డబ్బులు చెల్లిస్తారు. తొలిసారి గర్భం దాల్చినప్పుడు మూడు దశల్లో అందించే రూ.5వేల ఆర్థిక సహాయం పంపిణీలోనూ మార్పులు చేయనున్నారు. గర్భం దాల్చినప్పుడు రూ.3,000, ప్రసవం జరిగిన 14 వారాలకు రూ.2,000 చొప్పున రెండు విడతల్లోనే ఇస్తారు. అర్హులైన వారు ఈ స్కీమ్‌లో చేరాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అర్హులు https://pmmvycas.nic.in/public/beneficiaryuseraccount/login లింక్ ద్వారా నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ బెనిఫీషియరీ రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. పథకం కింద ప్రయోజనం పొందాలని భావిస్తే.. ఎల్ఎంపీ డేట్ కచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఎంసీపీ కార్డు కావాల్సి ఉంటుంది.. వీటిని ఆశ వర్కర్ దగ్గర అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. ఏపీలో కూడా అర్హులైనవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. డబ్బులు నేరుగా వారి, వారి అకౌంట్‌లలో జమ అవుతాయి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.