యాప్నగరం

విజయవాడవాసులకు అలర్ట్.. ఈ 11 ప్రాంతాల్లో ఆంక్షలు

ఉదయం 6 నుంచి 11 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుంది.. నిత్యావసరాలు, మెడికల్ షాపులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రజలు తమకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Samayam Telugu 25 Jul 2020, 12:18 pm
విజయవాడలో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలో ఉన్నాయి.. కానీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. విజయవాడలో 11 ప్రాంతాల్లో వారం పాటూ ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుంది.. నిత్యావసరాలు, మెడికల్ షాపులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రజలు తమకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Samayam Telugu విజయవాడలో ఆంక్షలు


మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో వైద్య సిబ్బందితో వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. పనులపై బయటకు వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్, పల్స్ టెస్టులు నిర్వహించనున్నారు. బారీకేడ్లతో రాకపోకల నియంత్రణ, కోవిడ్ జాగ్రత్తలపై మైక్‌లో ప్రచారం చేయనున్నారు. నగరంలోని పటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్‌సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్ ప్రాంతాల్లో వారం రోజుల పాటూ కఠినంగా ఆంక్షలు అమలు చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.